భారతదేశం, జూన్ 6 -- కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యానికి విజయ్ మాల్యా ఒక పాడ్‌కాస్ట్‌లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తనపై ఉన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. భారతదేశం నుండి దూరంగా ఉండటానికి గల కారణాలను సమర్థించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యానికి నేను అందరికీ క్షమాపణలు చెబుతున్నానని గురువారం పాడ్‌కాస్ట్‌లో విజయ్ మాల్యా అన్నారు.

ఇంకా పాడ్‌కాస్ట్‌లో విజయ్ మాల్యా మాట్లాడుతూ.. న్యాయమైన విచారణకు హామీ ఇస్తే తాను భారతదేశానికి తిరిగి రావడాన్ని పరిగణించవచ్చని అన్నారు. మాల్యా మార్చి 2016లో బ్రిటన్‌కు పారిపోయాడు. బ్రిటన్ నుంచి అప్పగించాలని భారతదేశం కోరుతోంది.

రుణాల ఎగవేత ఆరోపణలపై విజయ్ మాల్యా మాట్లాడుతూ.. మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవవచ్చు, కానీ నేను పారిపోలేదు. నేను భారతదేశం నుండి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చాను. కానీ నేన...