భారతదేశం, మే 24 -- విజయవాడ నగరంలో బాంబు కలకలం రేగింది. రైల్వేస్టేషన్‌, బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు..బాంబు స్క్వాడ్ తో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి ఫోన్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారణ చేశారు.

విజయవాడలో బాంబ్ కలకలం రేగింది. బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టామంటూ కంట్రోల్‌ రూమ్‌ కి అగంతకుడు ఫోన్‌ కాల్‌ చేశాడు. దీంతో బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్డులో తనిఖీ చేస్తున్నారు.

బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బీసెంట్ రోడ్డులోని దుకాణాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చి...