భారతదేశం, మే 18 -- విజయనగరంలో విషాద ఘటన జరిగింది. పట్టణంలోని కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. కారులో చిక్కుకుని ఊపిరి ఆడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు ఇవాళ ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు.

పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా వారి ఆచూకీ లభించలేదు. స్థానికంగా ఉన్న మహిళా మండలి ఆఫీసు వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు పిల్లల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఆడుకునేందుకు కారులోపలికి వెళ్లగా...లాక్ పడి ఊపిరి ఆకడ చిన్నారులు మృతి చెందారని తెలుస్తోంది.

మృతులు చారుమతి, ఉదయ్, చరిష్మా, మనస్విగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల్లో చారుమతి, చరిష్మా ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి నలుగురు పిల్లలు మృతి...