భారతదేశం, మే 9 -- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. జమ్మూ, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం జరగడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ కింద భారత్ ఇటీవల జరిపిన సీమాంతర దాడుల తర్వాత భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి ఈ సమావేశం జరిగింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జరిపిన సమావేశం దృశ్యాలు క్షణాల్లో వైరల్ గా మారాయి. నవ్వుతూ వారు మాట్లాడుకుంటున్న దృశ్యాలను పెద్ద ఎత్తున షేర్ చేశారు. పాకిస్తాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.