Hyderabad, జూన్ 13 -- వాస్తు ప్రకారం పాటించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు నియమాలు అనుసరించడం వల్ల జీవితంలోని ఇబ్బందుల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.

సానుకూల శక్తి, ప్రతికూల శక్తి మన జీవితం మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యం, బంధాలు, ఆర్థిక పరిస్థితులు కూడా దీనివల్ల ప్రభావితమవుతాయి. అందువల్ల వాస్తు నియమాలను పాటించడం చాలా మంచిదని చెబుతారు.

ఈరోజు డైనింగ్ టేబుల్ విషయంలో ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు, అవి నివారించాలి.

తిన్న తర్వాత మురికిపాత్రలను డైనింగ్ టేబుల్‌పై ఉంచడం చాలా చెడ్డ అలవాటు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. కుటుంబంలో అనారోగ్యం, మానసిక ఒత...