భారతదేశం, ఫిబ్రవరి 24 -- టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు విజయాలతో అదరగొట్టిన టీమిండియాకు సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లోనే బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో ఇండియా 76 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. దీంతో టీమ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఇండియన్ పేస్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇండియన్ పేస్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబేపై షోయబ్ అక్తర్ మాటలతో విరుచుకుపడ్డాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో హార్దిక్, శివమ్ కలిసి ఆరు ఓవర్లలో 67 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు. దీంతో ఈ జోడీని ఎద్దేవా చేస్తూ షోయబ్ అక్తర్ మాట్లాడాడు.

వెస్టిండీస్ లెజెండరీ పేసర్ మాల్కం మార్షల్ లా బ్యాటర్లను వణికించే బౌలింగ్ కెపాసిటీ హార్దిక్ పాండ్య, శివమ...