భారతదేశం, మే 25 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ 'మన మిత్ర'లో రేషన్ కార్డుల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొత్తం ఎనిమిది రకాల పౌరసరఫరాల శాఖ సేవలు మన మిత్ర (9552300009)లో అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో పాటు రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఐదేళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వారికి ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అలాగే 50 ఏళ్లు పైబడిన అవివాహితులు, విడాకులు తీసుకున్నవారు, అనాథాశ్రమాల్లో నివసించేవారు, ట్రాన్స్ జెండర్లకు కొత్త రేషన్ కార్డులు జారీ...