భారతదేశం, జూన్ 7 -- రుతుపవన కాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది పెంపుడు జంతువుల చర్మంపై ఉండే జుట్టును పూర్తిగా ఆరనివ్వదు. ఈ తేమ పురుగులు, ఈగలు, చర్మ వ్యాధులకు ఆదర్శవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

రుతుపవన కాలంలో పెంపుడు జంతువుల చర్మంపై ఉండే వెంట్రుకలు, చర్మ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే దానిపై శార్దా విశ్వవిద్యాలయం వెటర్నరీ అధికారి డాక్టర్ భాను ప్రతాప్, మాక్స్ పెట్ క్లినిక్, లాజ్‌పత్ నగర్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రశాంత్ కుమార్ HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని చిట్కాలను పంచుకున్నారు.

మీ పెంపుడు జంతువుకు స్నానం చేయించిన తర్వాత లేదా అవి బయట తడిచినట్లయితే పూర్తిగా ఆరనివ్వండి. లేదంటే వెంట్రుకల కింద ఉండిపోయి ఫంగస్, బ్యాక్టీరియా, దురదకు అవసరమైన ప్రమాదకర వాతావరణాన్ని అందిస్తాయి.

ఈ సమయంలో, వెంట్రుకలను కత్తిరించడం, క్రమం తప్పకుండా ...