భారతదేశం, ఫిబ్రవరి 20 -- టీ20 ప్రపంచకప్ లో భారీ హైప్ తో అడుగుపెట్టిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కటంటే ఒక్క రన్ చేయలేకపోతున్నాడు. ఈ పొట్టి కప్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అభిషేక్ డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ శర్మపై పాకిస్థాన్ వెటరన్ పేసర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్ 2026లో అభిషేక్ శర్మ మూడు మ్యాచ్ లు ఆడాడు. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ తో మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేశాడు. కానీ ఒక్క రన్ కూడా చేయలేకపోయాడు. మూడు మ్యాచ్ ల్లోనూ సున్నాకే పెవిలియన్ చేరిపోయాడు. మొత్తం మీద మూడు మ్యాచ్ లు కలిపి 8 బాల్స్ మాత్రమే ఆడగలిగాడు.

టీ20 ప్రపంచకప్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఇండియా ఆటగాడిగా టాప్ లో ఉన్న ఆశిష్ నెహ్రా సరసన చేరి చెత్త రికార్డును అభిషేక్ శర్మ మూటగట్టుకున్నాడు.

పాకిస్తాన్ షో 'గేమ్ ఆన్...