భారతదేశం, మే 28 -- 2025-26 మార్కెటింగ్ సీజన్లో 14 ప్రధాన ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీని సవరిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఒడిశలు (క్వింటాలుకు రూ.820), రాగులు (క్వింటాలుకు రూ.596), పత్తి (క్వింటాలుకు రూ.589), నువ్వులు (క్వింటాలుకు రూ.579) పంటలకు మద్దతు ధరను పెంచాలని సిఫార్సు చేశారు.

వరి ధాన్యానికి కనీస మద్ధతు ధరను క్వింటాలుకు రూ.69 పెంచారు. పప్పుదినుసుల్లో కందిపప్పుపై క్వింటాలుకు రూ.450, పెసరపై క్వింటాలుకు రూ.86 పెంచారు. మినుములకు ఎంఎస్పీని క్వింటాలుకు రూ.400 పెంచారు. నూనెగింజల విషయానికొస్తే వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటల కనీస మద్దతు ధరను వరుసగా క్వింటాలుకు రూ.480, రూ.441, ...