భారతదేశం, మే 6 -- స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆఫీసర్లు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో.. వరంగల్ హోటళ్ల బాగోతం మరోసారి బయట పడింది. ఓవైపు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సోదాలు చేస్తున్నా.. హోటల్స్, రెస్టారెంట్స్ మళ్లీ అదే దందాను సాగిస్తుండటం, అధికారులు కూడా నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు.. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆఫీసర్లు వరంగల్ నగరంలోని పలు హోటళ్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో.. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీషిక తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని ల్యాండ్ మార్క్, ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లో సోదాలు...