భారతదేశం, మే 21 -- ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలుల వర్షం కురవగా.. పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలాచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పూర్తిగా చల్లబడింది. వరంగల్ నగరంలో చాలాచోట్లా రోడ్లు నీట మునిగి జనాలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

మహబూబాబాద్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం పలు చోట్లా పిడుగులు పడ్డాయి. దీంతో ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీతో పాటు మరో గొర్ల కాపరి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన ఏశబోయిన చేరాలు యాదవ్ గొర్ల కాపరిగా పని చేసేవాడు.

రోజువారీలాగే గొర్లను మేతకు తీసుకెళ్లగా.. బుధవారం మధ్యాహ్నం పిడుగుప...