భారతదేశం, మే 21 -- వరంగల్‌లో ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళపై పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు మరో భూ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సీఐపై వేటు పడింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సీఐను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వివిధ కేసుల్లో సీఐ వేధింపులకు బాధితులుగా మారిన జనాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

వరంగల్ మిల్స్ కాలనీ సీఐ జె.వెంకటరత్నం సస్పెన్షన్ కు ప్రధానంగా మహిళపై లైంగిక వేధింపులే కారణమని తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఓ నేరం జరగగా.. అందులో నిందితురాలిగా ఉన్న మహిళను విచారణ పేరున లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది.

నిందితురాలిని శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడంతో ఆ మహిళ కొంతమంది పోలీస్ సిబ్బందికి విషయాన్ని తెలిపింది. నిందితురాలిగా ఉన్న మహిళన...