భారతదేశం, డిసెంబర్ 16 -- శ్రీలంక వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ అర్జున రణతుంగకు భారీ షాక్! పెట్రోలియం మంత్రిగా పనిచేసిన కాలానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై ఆయన్ని అరెస్టు చేయాలని యోచిస్తున్నట్లు అధికారులు కోర్టుకు తెలిపారు.
దీర్ఘకాలిక చమురు సేకరణ కాంట్రాక్టుల కేటాయింపు విధానాన్ని మార్చి, ఎక్కువ ధరకు స్పాట్ కొనుగోళ్లు చేశారనే ఆరోపణలు.. రణతుంగ, ఆయన సోదరుడిపై వచ్చినట్లు అవినీతి నిరోధక సంస్థ వెల్లడించింది.
"2017లో జరిగిన ఈ 27 కొనుగోళ్ల వల్ల రాష్ట్రానికి మొత్తం 800 మిలియన్ శ్రీలంక రూపాయలు (సుమారు రూ. 23.5 కోట్లు) నష్టం వాటిల్లింది," అని అవినీతి ఆరోపణలపై విచారణ కమిషన్ (సీఐఏబీఓసీ) తెలిపింది.
ప్రస్తుతం అర్జున రణతుంగ విదేశాల్లో ఉన్నారని, ఆయన శ్రీలంకకు తిరిగి రాగానే అరెస్టు చేస్తామని కమిషన్ కొలంబో మెజిస్ట్రేట్ అసంగా బొడరాగమాకు తెలియజేసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.