భారతదేశం, జనవరి 10 -- భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమవుతున్న 'వందే భారత్ స్లీపర్' రైలు త్వరలో పట్టాలెక్కనుంది. హౌరా-గువహటి (కామాఖ్య) మధ్య నడవనున్న ఈ రైలుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రైలులోని 'ఫస్ట్ క్లాస్ ప్రైవేట్ కూపే' విమాన ప్రయాణాన్ని తలపించేలా ఉండటం ప్రయాణికులను అబ్బురపరుస్తోంది.
ప్రముఖ కంటెంట్ క్రియేటర్ దేవరాజ్ దివాన్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ విలాసవంతమైన రైలు లోపలి విశేషాలను పంచుకున్నారు. ప్రధానంగా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లోని 'టూ-పర్సన్ కూపే' గురించి ఆయన వివరించారు.
"మీరు జంటగా ప్రయాణించాలనుకుంటే, ఇది అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక. పాతకాలపు ఓపెన్ క్యాబిన్లలా కాకుండా, ఇది పూర్తిగా మూసివేసి ఉండే ప్రైవేట్ గదిలా ఉంటుంది. ఇది ప్రయాణికులకు పూర్తి భద్రతతో పాటు అద్భుతమైన అనుభూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.