భారతదేశం, జూన్ 5 -- సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్ తో పాటు మరికొన్ని సినిమాలు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ గద్దర్ అవార్డుల్లో సత్తా చాటాయి. సాయికుమార్ నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలుస్తుండ‌టంతో ల‌క్కీస్టార్‌గా మారిపోయారు. ప్ర‌స్తుతం సాయికుమార్‌ తెలుగు, కన్నడ భాషల్లో 'చౌకీదార్' అనే సినిమాను చేస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

'చౌకీదార్' మూవీని వీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తుండగా.. చంద్రశేఖర్ బండియప్ప ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా చౌకీదార్ మూవీ నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా హృ...