భారతదేశం, మే 16 -- వరుసగా సూపర్ హిట్ మూవీస్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు సీనియర్ హీరో మోహన్ లాల్. తాజాగా 'తుడరుమ్'తో మలయాళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నారు. ఈ మూవీ కలెక్షన్లలో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలాంటి హిట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

తుడరుమ్ డిజిటల్ రైట్స్ ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇందు కోసం ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినట్లు టాక్. తుడరుమ్ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలోకి వచ్చిన అయిదు వారాల తర్వాత ఓటీటీలోకి రావాలనే కండీషన్ ఉంది. ఈ మేరకు మే నాలుగో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు.

తుడరుమ్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ థియేటర్లలో ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మంచి కలెక్షన్లు రాబడుతోం...