భారతదేశం, ఆగస్టు 13 -- సాధారణంగా వృద్ధుల్లో కనిపించే కాలేయ సమస్యలు ఇప్పుడు యువతలో కూడా పెరుగుతున్నాయి. ఈ ఆందోళనకరమైన ధోరణిపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హబ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకుల్లో కూడా లివర్ సిర్రోసిస్ (కాలేయ వ్యాధి) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాలేయ వైఫల్యం నివారించడానికి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విషపూరిత పదార్థాలను దూరం పెట్టాలని, తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

ఈ మార్పునకు ప్రధాన కారణం ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవడమేనని డాక్టర్ సల్హబ్ వెల్లడించారు. ఇది కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి, తిరిగి కోలుకోలేని సిర్రోసిస్‌కు దారితీస్తుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి వారికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (కాలేయ మార్ప...