భారతదేశం, మే 28 -- ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ కు రెండో సంతానంగా జన్మించిన మగబిడ్డకు లాలు యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి స్వయంగా నామకరణం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన మనవడికి 'ఇరాజ్' అని నామకరణం చేశారు. 2023 మార్చిలో మొదటి బిడ్డకు స్వాగతం పలికిన వీరిద్దరూ రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు.

తేజస్వీ యాదవ్ రెండో బిడ్డకు పెట్టిన పేరుకు సంబంధించిన వివరాలను లాలు యాదవ్ ఎక్స్ లో వెల్లడించారు. తేజస్వీ యాదవ్ దంపతులకు తొలి సంతానం ఆడబిడ్డ. ఆమెకు కాత్యాయిని అనే పేరు నిర్ణయించారు. ''పవిత్రమైన నవరాత్రుల్లో 6వ రోజైన కాత్యాయనీ అష్టమి నాడు కాత్యాయని జన్మించిందని, అందువల్ల ఆమె పేరును కాత్యాయినిగా నిర్ణయించామని లాలు వెల్లడించారు. ''ఇప్పుడు కాత్యాయిని తమ్ముడికి 'ఇరాజ్' అనే పేరును నేను, రబ్రీ దేవి నిర్ణయించాం. ఆ పేరుకు...