భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఏఎస్ఆర్ జిల్లాలోని లంబసింగిలో కుంకుమ పువ్వులను పండించడానికి ప్రైవేట్ ఏజెన్సీలు ముందుకు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులను పీపీపీ పద్ధతిలో సాగు చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలని, గిరిజన వర్గాలను కూడా భాగస్వామ్యం చేయాలని వ్యాఖ్యానించారు. లంబసింగిలో ఈ కుంకుమపువ్వు సాగు కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ 10 ఎకరాలు కోరిందని జిల్లా ఉద్యానవన అధికారి కర్ణ తెలిపారు.

భూమి, సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సెరికల్చర్ విభాగానికి చెందిన 18 ఎకరాల భూమిని గుర్తించినట్టుగా సమాచారం. అందులో 10 ఎకరాలు ఏజెన్సీకి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఏజెన్సీ ఇప్పటికే విదేశాల నుండి విత్తనాలు సేకరించిందని, త్వరలో మరో కీలక అడుగు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పంట అధిక వాణిజ్య...