Hyderabad, జూన్ 2 -- ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటించిన మూవీ కుబేర. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. అయితే ఆదివారం (జూన్ 1) ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ధనుష్ చేసిన కామెంట్స్ అభిమానులను ఆకర్షించాయి. తనను ద్వేషిస్తూ, తన సినిమాల రిలీజ్‌కు ముందు నెగటివ్ ప్రచారం చేసే వారికి అతడు గట్టి సందేశమే ఇచ్చాడు.

ఈ ఈవెంట్లో ధనుష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తనను ద్వేషిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి ఈ ఈవెంట్ వేదికపై నుంచి సందేశం పంపించాడు. "నా గురించి మీరు ఎన్నయిన పుకార్లు పుట్టించండి. ఎన్నయినా వ్యతిరేక వార్తలు ప్రచారం చేయండి. నా సినిమా రిలీజ్ కు ముందు ప్రతిసారి నెలన్నర రోజుల నుంచి ఈ నెగటివ్ ప్రచారం మొదలవుతుంది.

కానీ మీరేమీ చేయలేరు ఎందుకంటే నా అభిమానులే నాకు బలమైన మూలస్తంభాలు. వాళ్లు 23 ఏళ్లుగా నాతో ఉన్నారు. వాళ్లు నా స్నేహితు...