Hyderabad, మే 14 -- కూర్చొని పని చేయడం వల్లన మీ శరీరం, మెదడు రెండూ ప్రమాదంలో పడినట్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పైకి చురుగ్గా కనిపించినప్పటికీ, మీ డెస్క్ వద్ద లేదా సోఫాలో ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వాళ్ల మెదడు పనితీరు క్రమంగా దెబ్బతింటుందట. కొత్త పరిశోధన ప్రకారం, ఇది జ్ఞాపకశక్తి, అభిజ్ఞానానికి సంబంధించిన ప్రాంతాలలో కుంచించుకుపోవడానికి కారణం కావొచ్చు.

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, ఎక్కువసేపు కూర్చోవడం మీ మెదడుకు హాని కలిగిస్తుందని పరిశోధన సూచిస్తుంది. ఏడు సంవత్సరాల అధ్యయనంలో ఎక్కువగా కూర్చుని పనిచేసే వారిలో మెదడు కుంచించుకుపోవడం, మానసిక క్షీణత కనిపిస్తాయని తెలిసింది. ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్నిక్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల తిరిగి మార్చవచ్చనే ఆలోచనను ఈ రీసెర్చ్ ఛాలెంజ్ చేస్తుంది.

వాండర్‌బిల్ట్ యూనివర్స...