భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణలో విద్యుత్ శాఖ నూతన సాంకేతికతను వినియోగించుకుంటోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో వేగం పెంచింది. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మేలు చేస్తోంది. అలాగే తన దరఖాస్తు స్థితిగతులను దరఖాస్తుదారుడే స్వయంగా తెలుసుకునేలా ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకువచ్చింది.

ప్రస్తుతం విద్యుత్ శాఖ నూతన సాంకేతికతతో రైతులకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను త్వరగా మంజూరు చేస్తోంది. ఇందుకోసం రైతులు ఎన్‌పీడీసీఎల్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ కోసం రైతు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ వెంటనే దరఖాస్తుదారుడి సెల్ ఫోన్‌కు సమాచారం అందుతుంది. దీని తర్వాత టీజీఎన్‌పీడీసీఎల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

యాప్‌ను ఓపెన్‌ చ...