భారతదేశం, మే 5 -- కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభం అయ్యింది. దీని ద్వారా ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. రెండు మూడు రోజుల్లో మీ సేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే.. సరైన లెక్కలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు ఉండటం లేదు. దీంతో రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు, పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదు.

దేశంలో వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు సరైన వివరాలు లేకపోవడం సమస్...