భారతదేశం, మే 21 -- ఏపీలో రేషన్ సరఫరా కోసం వినియోగిస్తున్న మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్ తర్వాత రాష్ట్రంలో అక్రమాలు ఆగిపోతాయని భావించినా అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమాలపై పెద్ద ఎత్తున తనిఖీలు, దాడులు చేశారు.
ఈ క్రమంలో రేషన్ డీలర్లు, మొబైల్ డెలివరీ యూనిట్లు కలిసి రేషన్ బియ్యాన్ని కారు చౌకగా కొనుగోలు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఎండీయూలను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. తాజాగా క్యాబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ బియ్యాన్ని 2019కు ముందు రేషన్ దుకాణాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.