భారతదేశం, మే 27 -- తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. లక్షలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు మార్పులు, చేర్పుల కోసం అప్లై చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. నూతన కార్డులను జారీ చేస్తున్నారు. ఈ సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. కొత్తగా జారీ అవుతున్న కార్డులకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు గుర్తించింది.

కేంద్ర ప్రభుత్వం అక్రమ రేషన్‌కార్డుల గుట్టు రట్టు చేస్తోంది. ఉదాహరణకు ఒక్క కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 1700 అక్రమ కార్డులున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఆ కార్డుల వివరాలను జిల్లాకు పంపించడంతో.. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 83 శాతం పూర్తయింది. కేంద్రం అభ్యంతరం తెలిపిన కార్డుల్లో 1400 వరకు వివరాలపై ఆయా మండలాల్లో తహసీల్దార్లు విచారణ పూర్...