భారతదేశం, మే 23 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, కార్డుల్లో మార్పులు చేర్పులకు ఎలాంటి గడువు లేదని.. అర్హత ఉన్న వారు రేషన్‌ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి నాదెండ్ల తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైస్ కార్డులు అందిస్తామని చెప్పారు.

కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదని దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నామని ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టారు. గత రెండేళ్ల నుంచి కొత్త కార్డులు జారీ కాలేదు. కార్డుల...