Telangana, మే 28 -- తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను రేపు(మే 29) కేటాయించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద 87 వేలకుపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి మాత్రమే సీట్లను అలాట్ చేస్తారు.

దోస్త్ 2025 ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ గడువు జూన్ 6వ తేదీతో ముగుస్తుంది. సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే. వారి సీటు రద్దు అవుతుంది.

దోస్త్ ఫస్ట్ ఫేజ్ లో సీటు పొందే విద్యార్థులు https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు. ఈ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉం...