భారతదేశం, జూన్ 1 -- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ కాన్పూర్) జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలను జూన్ 2, 2025 సోమవారం(రేపు) విడుదల చేస్తుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2025 రాసిన అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ఫలితాలను చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాల సందర్భంగా అభ్యర్థులు అలర్ట్ గా ఉండాలి.

జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ 2025 విడుదలైన తర్వాత అభ్యర్థులు ముఖ్యమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఫలితాలు త్వరగా చూసుకోవచ్చు. ఈ కింది వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. అప్లికేషన్/రిజిస్ట్రేషన్ నెంబరు, జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డు, పాస్ వర్డ్.

ఫలితాల విడుదలకు ముందు జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 25న విడుదల చేశారు. మే 27 సాయంత్రం 5 గంటల వ...