Andhrapradesh, జూన్ 8 -- ఏపీ పీజీ సెట్‌-2025 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచి(జూన్ 09) నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ నిర్ణయించిన ప్రకారం. జూన్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఎగ్జామ్ జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 25 వేలకుపైగా అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు.

ఏపీ పీజీసెట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను జూన్ 11వ తేదీ నుంచి 15 తేదీల మధ్య విడుదల చేస్తారు. వీటిపై 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ పీజీసెట్ - 2025 లో సాధించిన ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఫలితాల విడ...