భారతదేశం, జూన్ 2 -- తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ వ్యవ‌స్దను ప్రక్షాళన చేసి భూ ప‌రిపాల‌న‌ను ప్రజ‌ల వ‌ద్దకే తీసుకువెళ్తున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సులపై సోమవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ స‌మ‌స్యల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపేలా ఏప్రిల్ 14వ తేదీన భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చారు. మొదటి దశలో 17వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్రయోగాత్మకంగా అమ‌లు చేసి రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వహించారు. ఆ త‌ర్వాత మే 5వ తేదీ నుంచి 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించారు.

తాజాగా జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూ భార‌తి చ‌ట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండ‌లాల్లో రెవెన్...