భారతదేశం, మే 14 -- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15న ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం, కాళేశ్వర త్రివేణీ సంగమంలో ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు.
ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాలలో పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతి మహా పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు(15 న) ఉదయం 5 .44 గంటలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పాటు పుష్కర స్నానం ఆరంభిస్తారు.
ప్రతీ రోజూ ఉదయం 8 .30 గంటల నుండి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్ లో 6 .45 నుండి 7 .35 గంటల వరకు సరస్వతి ఘాట్ లో ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.