భారతదేశం, మే 8 -- సూర్య మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. రెట్రో నుంచి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌లో ప‌ది కోట్ల‌ను పేద విద్యార్థుల చ‌దువు కోసం విరాళంగా అంద‌జేశాడు. అగ‌రం ఫౌండేష‌న్ స‌భ్యుల‌కు డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజుతో క‌లిసి సూర్య చెక్ అందిస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. సూర్య గొప్ప మ‌న‌సుపై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తోన్నారు.

అగ‌రం ఫౌండేష‌న్‌ను సూర్య‌నే స్థాపించాడు. పేద విద్యార్థుల‌కు ఉచితంగా విద్య‌ను అందించ‌డంతో పాటు గ్రామీణ ప్ర‌జ‌ల‌ ఆర్థిక భ‌ద్ర‌త‌ను పెంపొందించే ఉద్దేశంతో 2006లో ఈ ఫౌండేష‌న్‌ను నెల‌కొల్పారు.

కాగా రెట్రో బుధ‌వారం నాటితో వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌లోకి అడుగుపెట్టిన‌ట్లు నిర్మాణ సంస్థ స్వ‌యంగా ప్ర‌క‌టించింది. 104 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. త‌మిళంలో మ...