Hyderabad, మే 18 -- మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా యమదొంగ. 2007 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌కు హీరోయిన్ ప్రియమణి జోడీగా నటించింది.

మరో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ మమతా మోహన్‌దాస్ అలరించింది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ రంభ అలరించింది. వీరితోపాటు నవ్‌నీత్ కౌర్, అర్చన, ప్రీతి జంగ్యాని వంటి బ్యూటిఫుల్స్ మరో పాటలో నర్తించి ఆకట్టుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యముడు పాత్రలో అదరగొట్టారు. యముడికి భార్యగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సైతం అలరించారు.

ఇలా ఎంతోమంది విశేష నటీనటులతో యమదొంగ సినిమాను చిత్రీకరించారు. 2007 ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ యమదొంగ ...