Hyderabad, జూన్ 9 -- మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ కు గతేడాది అస్సలు కలిసి రాలేదు. మలైకొట్టై వాలిబన్, బరోజ్ 3డీ సినిమాలు డిజాస్టర్లు కావడంతో అతని పనైపోయిందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఎల్2: ఎంపురాన్, తుడరుమ్ సినిమాలతో బ్లాక్‌బస్టర్లు అందించడమే కాదు.. మలయాళం బాక్సాఫీస్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు.

మోహన్‌లాల్ తన కెరీర్ మొదలు పెట్టి 45 ఏళ్లవుతోంది. కానీ ఇప్పటికీ అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఏడాది అతడు ఇచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది ఒక్కడే కేవలం రెండే సినిమాలతో మాలీవుడ్ కు ఏకంగా రూ.500 కోట్ల బిజినెస్ చేసి పెట్టాడు. ఎల్2: ఎంపురాన్ తో ఈ ఏడాది తొలి మెగా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఏకంగా రూ.265.5 కోట్లు వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా చరిత్ర సృష్టించింది.

ఇక తాజాగా తుడరుమ్ మూవీతో అదే మ...