Warangal,telangana, మే 4 -- దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, రెండేళ్లలో ప్రాజెక్టు పనులు వంద శాతం కంప్లీట్ చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తీసుకు వస్తామని వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి పారుదల, పౌర సరఫరా శాఖలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేశారు. అంతకుముందు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌ...