భారతదేశం, మే 15 -- టెల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ A90ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఐటెల్ ఏ80కి అప్డేట్ వెర్షన్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లు చాలానే ఉన్నాయి. కొత్త ఐటెల్ ఏ90 స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని ముఖ్య లక్షణం డైనమిక్ బార్, ఇది నోటిఫికేషన్‌లు, ఇతర అలర్ట్‌లను సులభంగా చూడటానికి సహాయపడుతుంది.

ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఐటెల్ ఏ90 ఆక్టా-కోర్ Unisoc T7100 ప్రాసెసర్‌తో వస్తుంది. 4జీబీ ర్యామ్ ఉంది. అవసరమైతే దీనిని 8జీబీ వర్చువల్ ర్యామ్‌కి విస్తరించవచ్చు. ఇది అప్లికేషన్లను సజావుగా అమలు చేయడంలో, మల్టీ టాస్కింగ్‌లో సహాయపడుతుంది. ఈ ఫోన్‌లో 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆధారంగా రూపొందించిన ఐటెల్ ఓఎస్14పై నడుస్తుంది. ...