భారతదేశం, మే 28 -- సుమారు రూ.3653.10 కోట్ల వ్యయంతో 108.134 కిలోమీటర్ల పొడవైన బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

మరోవైపు, ప్రయాణీకులు, వస్తువుల రవాణాను సులభతరం, వేగవంతం చేసే రెండు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.3,399 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులు 2029-30 నాటికి పూర్తవుతాయని అంచనా. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అని కేంద్రం తెలిపింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....