భారతదేశం, ఆగస్టు 28 -- దేశంలో కొత్తగా నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు రానున్నాయి. దీని ద్వారా భారతీయ రైల్వే లైన్లలో కొత్తగా 565 కిలోమీటర్లు చేరనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. కనెక్టివిటీ, సరుకు రవాణా, ప్రాంతీయ అభివృద్ధిని పెంచే లక్ష్యంతో సుమారు రూ.12,328 కోట్ల విలువైన నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టులలో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఒక కొత్త రైలు మార్గం రానుంది. కర్ణాటక, తెలంగాణ, బీహార్, అస్సాంలలో మల్టీ-ట్రాకింగ్ పనులు ఉన్నాయి.

గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలోని దేశల్పర్-హాజిపిర్-లూనా, వాయోర్-లఖ్‌పత్ రైలు మార్గం మారుమూల ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని అందిస్తుంది. రూ.2,526 కోట్ల అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్ గుజరాత్‌లోని రైల్వే నెట్‌వర్క్‌కు...