భారతదేశం, మే 11 -- ఆదాయపు పన్ను అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ. 70 లక్షలు లంచం డిమాండ్ చేసిన కేసులో సీబీఐ పలువురిని అరెస్ట్ చేసింది. ఇందులో హైదరాబాద్ ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్ లావుడ్యా ఉన్నారు. ఆయనే కాకుండా.. ఏపీకి చెందిన సాయిరాం పాలిశెట్టి, వీరనాగా శ్రీరాంగోపాల్, ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్‌ డీజీఎం విరాల్‌ కాంతిలాల్‌ మెహతాతో పాటు సాజిదా హుస్సేన్‌షాను అదుపులోకి తీసుకుంది.

షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు అనుకూలంగా దాఖలైన అప్పీలును పరిష్కరించే విషయంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావటంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి కమిషనర్‌ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. మధ్యవర్తిని అరెస్ట్‌ తర్వాత పలు ప్రాంతాల్లో సోదాలు జరి...