భారతదేశం, మే 1 -- శాంసంగ్ గెలాక్సీ ఏ, ఎం, ఎఫ్ సిరీస్ కు చెందిన పలు స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మే 1 నుంచి శాంసంగ్ అధికారిక ఛానెల్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర రిటైల్ అవుట్ లెట్ లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరిమిత కాల ఆఫర్ లో భాగంగా గెలాక్సీ ఏ55 5జీ ధర రూ.42,999 నుంచి రూ.26,999కు తగ్గింది. గతంలో రూ.33,999గా ఉన్న గెలాక్సీ ఏ35 5జీ రూ.19,999కే లభిస్తుంది.

గతంలో రూ.15,999గా ఉన్న గెలాక్సీ ఎం16 5జీ ధర ఇప్పుడు డిస్కౌంట్ లో భాగంగా రూ.10,749 లకు లభిస్తుంది. అలాగే, గతంలో రూ.15,999గా ఉన్న గెలాక్సీ ఎఫ్16 5జీ ధర కూడా రూ.10,749 గా ఉంది. గతంలో అధిక ధరలకు లిస్ట్ అయిన గెలాక్సీ ఎం06 5జీ, ఎఫ్06 5జీ ఇప్పుడు రూ.8,199కే లభిస్తాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....