భారతదేశం, జూన్ 22 -- రియల్‌మీ భారతదేశంలో తన జీటీ 7 సిరీస్‌కు కొత్త స్మార్ట్​ఫోన్‌ని ఇటీవలే విడుదల చేసింది. ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రోతో మంచి గుర్తింపు పొందిన తర్వాత, ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్ కింద రియల్‌మీ జీటీ 7 అనే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ చిప్‌తో పర్ఫార్మెన్స్ విభాగంలోకి ప్రవేశించింది. అయితే, సుమారు రూ. 40,000 ధరలో ప్రీమియం ఫీచర్లు, పర్ఫార్మెన్స్‌ను అందించే పలు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. అటువంటి ప్రముఖ మిడ్-రేంజ్ ఫోన్‌లలో ఒకటి.. ఈ ఏడాది జనవరిలో విడుదలైన కొత్త వన్‌ప్లస్ 13ఆర్. ఈ నేపథ్యంలో కొత్త రియల్‌మీ జీటీ 7 అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి, వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్‌తో పోల్చి చూద్దాము..

రియల్‌మీ జీటీ 7 స్మార్ట్​ఫోన్​ ...