Hyderabad, మే 18 -- టాలీవుడ్‌లో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస మూవీస్ చేస్తుంది. అయితే, తాజాగా తాప్సీ పన్ను రూ. 4.33 కోట్లతో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.

తాప్సీ తన సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబైలో రూ. 4.33 కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్నట్లుగా స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజిఆర్) ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ముంబై గోరేగావ్ వెస్ట్‌లో 1,390 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది.

మొత్తం 1,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాపర్టీని నిర్మించారు. అయితే, స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఐజిఆర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, ఈ ఆస్తి ఇంపీరియల్ హైట్స్ అని పిలువబడే ...