భారతదేశం, మే 26 -- మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో పురాతన ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇక వాటి శిల్ప కళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతం. వందల, వేల ఏళ్ల కిందటి ఇంజినీరింగ్ వ్యవస్థ ఇప్పటికీ అర్థం కాదు. చాలా ఆలయాలు మిస్టరీగానే ఉన్నాయి. సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచే అనేక ఆలయాలు భారత్‌లో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరానికి దగ్గరలో ఉన్న బెహతా గ్రామంలోని ఆలయం కూడా ఉంది.

ఈ ఆలయం వర్షం వస్తుందని ముందే చెబుతుంది. రుతుపవనాల రాకను ముందుగానే అంచనా వేస్తుంది. పురాతన కాలం నుండి ఈ ఆలయంలో జగన్నాథుడిని పూజిస్తున్నారు. అందుకే దీనిని జగన్నాథ ఆలయం లేదా మాన్‌సూన్ టెంపుల్ అంటారు. స్థానికులు మాత్రం ఈ ఆలయం దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైనదని చెబుతున్నారు. కానీ దీనికి సరైన ఆధారాలు లేవు.

ఈ ఆలయం ముందు నుండి...