భారతదేశం, మే 31 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమాకు ఓ రేంజ్‌‍లో క్రేజ్ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం 2010 అక్టోబర్‌లో రిలీజైంది. అప్పట్లో మిక్స్డ్ టాక్‍తో ఈ చిత్రం ప్లాఫ్ అయింది. ఆ తర్వాత టీవీల్లో వందలసార్లు ప్రసారమైనా ఈ సినిమా టీఆర్పీల్లో అదరగొట్టింది. కల్ట్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అంతటి క్రేజ్ సాధించిన ఖలేజా సుమారు పద్నాలుగునరేళ్ల తర్వాత ఈ శుక్రవారం (మే 30) థియేటర్లలో రీ-రిలీజైంది. తొలి రోజే సూపర్ కలెక్షన్లతో దుమ్మురేపింది.

ఖలేజా సినిమా రీ-రిలీజ్‍లో తొలి రోజు ఏకంగా రూ.6.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం రీ-రిలీజ్‍కు ఫుల్ బజ్ కనిపించింది. బుకింగ్స్ జోరుగా జరిగాయి. అభిమానులు థియేటర్లలో ఫుల్ హంగామా చేశారు. అందుకు తగ్గట్టే రీ-రిలీజ్‍లో ఫస్ట్ డే...