Telangana,hyderabad, మే 23 -- తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద పలు మండలాల్లో ఈ చట్టం ప్రకారమే సేవలు అందుబాటులో రాగా. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. కొత్త చట్టం ప్రకారం. భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే సర్వే మ్యాప్ తప్పనిసరి. కాబట్టి..సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌క్ష్యంగా లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కం చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడ‌త‌ కింద ఐదు వేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను తీసుకోబోతున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా.. వీరందరికీ మే 26వ తేదీ నుంచి ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్...