Telangana, మే 25 -- రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం. స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇదే అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. స్లాట్ బుకింగ్ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు.

ప్ర‌యోగాత్మ‌కంగా మొద‌టి ద‌శ‌లో ఏప్రిల్ 10వ తేదీన 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇక్క‌డ‌ మంచి ఫ‌లితాలు రావ‌డంతో మే 12వ తేదీ నుంచి 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లు చేశారు. ఈ రెండు విడ‌త‌లు క‌లిపి 47 చోట్ల అమ‌లు చేసిన విధానం విజ‌య‌వంత‌మైంద‌ని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ రెండు విడ‌త‌ల్లో క‌లిపి దాదాపు 36 వేల రిజిస్ట్ర...