భారతదేశం, మే 15 -- ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల రాక సమీపిస్తుండటంతో వాతావరణంలో ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షాలతో రాయలసీమలో పలు ప్రాంతాలు తడిచి ముద్దయ్యాయి.

అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రజాశక్తి నగర్‌, సీపీఐ కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఫైర్‌ సిబ్బంది ముంపు బాధితులను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఐదున్నర వరద ముంచెత్తిన సమాచారం అందడంతో రోడ్లపైకి నీరు చేరడంతో స్థానిక ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు తరలించారు.

జంగాలపల్లి, గంగుల కుంట ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. కల్వర్టులను తొలగించి వరద ప్రవాహం నుంచి బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. రెవిన్యూ సిబ్బంది పునరావాస చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్...