Telangana, జూన్ 10 -- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరగా ఇల్లు పూర్తి చేసుకుంటే అంత త్వరగా బిల్లు చెల్లిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సోమవారం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను పేదవాళ్లలో బహుపేదవాళ్లకు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు రాబోయే 10 రోజుల్లో గృహ ప్రవేశాలు చేసుకోబోతున్నారని మంత్రి పొంగులేటి చెప్పారు. పనులను బట్టి నిధుల విడుదల ఉంటుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.98.64 కోట్లు విడుదల చేశామన్నారు.పునాది స్థాయిలో 9,877, గోడల స్థాయిలో 1,839, స్లాబ్‌ స్థాయిలో 388 ఇళ్లకు ఈ నిధులను అందించినట్లు వివరించారు.

భూభారతి చట్టం రెఫరెండంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామన్నా...