Hyderabad, మే 29 -- ఇండియాలో ప్రతిరోజూ కచ్చితంగా చపాతీలను తినే వారి సంఖ్య చాలా ఎక్కువ. బరువు తగ్గాలన్న ప్రయత్నంలోనే ఎంతో మంది రోటీలను తినేందుకు ఇష్టపడతారు. మధ్యాహ్న భోజనం అయినా, రాత్రి భోజనం అయినా ఆహారంలో చపాతీ చాలా ముఖ్యం. చాలాసార్లు రాత్రిపూట మిగిలిన చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి.

ఆయుర్వేదం ప్రకారం, ఇలా రాత్రి వండిన చపాతీలు ఉదయం తింటే శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని నెయ్యి, ఉప్పుతో కలిపి తింటే శరీరానికి ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. రాత్రి వండిన చపాతీ ఉదయం చప్పగా అనిపోతుంది. అందుకే దానిపై కొద్దిగా నెయ్యి పూసి, కొద్దిగా ఉప్పుతో తింటే దాని రుచి కూడా పెరుగుతుంది. దీన్ని మీ డైట్ లో భాగం చేసుకుంటే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.

మీకు ఏదైనా జీర్ణ సమస్యలు ఉంటే, మీరు పాత రొట్టెను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వాస్తవానికి, పాత రొ...